హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అవినీతి చక్రవర్తి అని
టీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్రావు ఆరోపించారు. నెల్లూరు జిల్లా
బాలాయపల్లెలో చంద్రబాబు భూకబ్జాను ఆధారాలతో కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ
భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బినామీ పేర్లతో
చంద్రబాబు 300 ఎకరాల భూమిని అక్రమించారని కేసీఆర్ అన్నారు.
చంద్రబాబు భూభాగోతాన్ని కోవూరు ఎన్నికల్లో ఎండగడుతామన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నెల్లూరు జిల్లాకే చెందిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్తిగా బరిలో నిలుపుతామన్నారు. మార్చి 6,7 తేదిల్లో కోవూరులో ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ పక్కా ఆంధ్రాపార్టీ అని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేసే సత్తా చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో తనదైన శైలిలో చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో సమరశంఖం పూరించారు.
చంద్రబాబు భూభాగోతాన్ని కోవూరు ఎన్నికల్లో ఎండగడుతామన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నెల్లూరు జిల్లాకే చెందిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్తిగా బరిలో నిలుపుతామన్నారు. మార్చి 6,7 తేదిల్లో కోవూరులో ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ పక్కా ఆంధ్రాపార్టీ అని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేసే సత్తా చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో తనదైన శైలిలో చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో సమరశంఖం పూరించారు.
0 comments:
Post a Comment