చంద్రబాబుపై అంబటి మండిపాటు

print this page
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబుపై అక్టోబర్ 17న గులాం ఆహ్మద్ బెంచ్ తీర్పునిచ్చిందన్నారు. అయితే అపుడు చంద్రబాబు ఆత్మవిశ్వాసం ఏమైందని అంబటి ప్రశ్నించారు. ఆరోజు న్యాయవ్యవస్థపై తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలు చేయలేదా అన్నారు. బాబుకు ముందుంది ముసళ్ల పండగ అని వ్యాఖ్యానించారు. 


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై చంద్రబాబు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. అంతేకాక జగన్ పెంపక విషయంపై బాబు అవాకులు, చెవాకుల పేలడాన్ని అంబటి తప్పు పట్టారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎంతటి ప్రయోజకుడో ప్రజలందరికి తెలుసని.. ఆయన యూనివర్సిటీ ఫీజును చంద్రబాబే కట్టాడా లేక ఎవరైనా కట్టారా అనే విషయాన్ని చంద్రబాబు వెల్లడించి... నిజాయితీని చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తామే ఆ గుట్టును బయటపెడుతామన్నారు. చంద్రబాబు లాంటి అవినీతిపరుడు దేశంలో లేరని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...